దగ్గర పడుతోన్న కాళేశ్వరం కమిషన్ విచారణ.. మరోసారి మామఅల్లుడి భేటీ
హైదరాబాద్, 30 మే (హి.స.) మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ మరోసారి గులాబీ బాస్ తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన నేటి మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామహౌజ్కు చేరుకున్నారు. ఇటీవలే జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ జూన్ 5న కేసీఆర్ను, జూన్ 9న హరీశ్ ర
హరీష్ రావు


హైదరాబాద్, 30 మే (హి.స.)

మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ మరోసారి గులాబీ బాస్ తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన నేటి మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామహౌజ్కు చేరుకున్నారు. ఇటీవలే జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ జూన్ 5న కేసీఆర్ను, జూన్ 9న హరీశ్ రావును విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విచారణ హాజరవుతారా.. అన్న దానిపై స్పష్టత లేనప్పటికీ వారిద్దరూ కాళేశ్వరం కమిషన్ సభ్యులు ప్రశ్నించే అంశాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తేదీ ప్రకారం మొదట విచారణకు కేసీఆర్ హాజరుకావాల్సి ఉండగా కమిషన్ సభ్యులు అడిగే ప్రశ్నలపై ఇప్పటికే ఆయన ఫుల్గా ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టులపై కింద సాగు అవుతున్న భూములు, విస్తీర్ణం తదితర అంశాలను నివేదిక రూపంలో హరీశ్తో కలిసి సిద్ధం చేయబోతున్నట్లుగా సమాచారం.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande