అమరావతి, 30 మే (హి.స.)
అమరావతి: అమరావతి అనుసంధానతలో కీలకమైన ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రాజధాని నుంచి విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిని అనుసంధానించేందుకు కృష్ణా నదిపై ఆరు వరుసలతో ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వైపు నుంచి అమరావతిలోకి అడుగు పెట్టేందుకు ఇది ముఖద్వారంగా మారనుంది. దూరాభారం కూడా తగ్గుతుంది. ఇందుకోసం సమగ్ర సర్వే చేసి డీపీఆర్ ఇచ్చేందుకు ఏడీసీఎల్.. సలహా సంస్థ ఎంపికలో నిమగ్నమైంది. ఆర్ఎఫ్పీ కోసం బిడ్లు ఆహ్వానించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ సాంకేతిక బిడ్ల మదింపు స్థాయిలో ఉంది. ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన కూడా పూర్తయ్యాక కన్సల్టెంట్ను ఎంపిక చేస్తారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పలు ప్రాంతాల్లో
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ