న్యూఢిల్లీ, 30 మే (హి.స.)
ఈ ఏడాది జనవరి నుంచి 1100 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగి వచ్చారు లేదా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారని మన విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన జనవరి నెల నుంచి ఇప్పటివరకు 1,080 మంది భారతీయులను బహిష్కరించారని చెప్పారు.
వీరిలో 62 శాతం వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారన్నారు. అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతున్నదని, అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని మన దేశం వెనక్కి తీసుకుంటున్నదని ఆయన వివరించారు. ఇరాన్లో ముగ్గురు భారతీయులు అదృశ్యమైన విషయంపై ఆ దేశ అధికారులతో సంప్రదింపుల్లో ఉన్నామని ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..