తెలంగాణ, మహబూబ్నగర్. 30 మే (హి.స.) మహబూబ్ నగర్ జిల్లా, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపునకు వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీహరి ఇన్నోవా కారును… పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ధ్వంసం కాగా, ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదని, ఎమ్మెల్యే క్షేమంగా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు