తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 30 మే (హి.స.)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం చేస్తామని, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ కొత్తగూడెంలో మొత్తం 17మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. అందులో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే, లొంగిపోయిన వారంతా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు వసతులు కల్పిస్తామని, వారి భవిష్యత్తుకు పూర్తి హామీ ఇస్తున్నామని ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు