జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించాలి.. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి.
తెలంగాణ, నాగర్ కర్నూల్.30 మే (హి.స.) జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాత్రికేయులు కనీస ధర్మం పాటించడం లేదని విమర్శలు ఈమధ్య బాగా పెరిగాయని, అందుకు కారణం మనమేనని చెప్పారు. మన నైతిక విలువలు కాప
మీడియా అకాడమీ


తెలంగాణ, నాగర్ కర్నూల్.30 మే (హి.స.)

జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాత్రికేయులు కనీస ధర్మం పాటించడం లేదని విమర్శలు ఈమధ్య బాగా పెరిగాయని, అందుకు కారణం మనమేనని చెప్పారు. మన నైతిక విలువలు కాపాడుకోవడంతోపాటు పారదర్శకతతో కూడిన వార్తలను ప్రచురించినప్పుడు ప్రజల్లో మనపై గౌరవం పెరుగుతుందని వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని అటవీ శాఖ వనమాలిక ఆవరణలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా పాత్రికేయులకు వివిధ అంశాలపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాస్ రెడ్డి 'నైతిక నియమాలు, మీడియా-చట్టాలు' అనే అంశంపై మాట్లాడుతూ.. మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు పాత్రికేయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఈ శిక్షణలో పాత్రికేయులు దాదాపుగా నూటికి 90 శాతం మంది ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు ఉండడం సంతోషకరమన్నారు. త్వరలోనే పాత్రికేయులకు హైదరాబాద్లో వారం రోజులపాటు మీడియా అకాడమీ ద్వారా కంప్యూటర్ శిక్షణ నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నామని, అది కంప్యూటర్పై అవగాహన లేని వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande