హైదరాబాద్, 30 మే (హి.స.)
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో నేడు మీడియాతో ఆయన మాట్లాడుతూ..
ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా
చెంచులకు 9200 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాంతంలో ఉండే నియోజక
వర్గాలకు అదనంగా ఇస్తున్నామని వెల్లడించారు. 2 లక్షల 10 వేల ఇండ్లు అర్హుల జాబితా ఫైనల్ అయ్యిందని ప్రకటించారు. 24 వేల ఇండ్లు నిర్మాణం ప్రారంభం అయ్యిందని.. నిర్మాణానికి రూ. 130 కోట్లు చెల్లించామని తెలిపారు. పారదర్శకంగా అర్హుల ఎంపిక చేస్తున్నామని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా సమాన స్థాయిలో ఇండ్లు కేటాయింపులు జరుగుతున్నాయన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలో కూడా 40 శాతం ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేటీఆర్ లాంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వలేదన్నారు.. వాళ్ళనే ఎంపిక చేసుకోండి అని అన్నట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..