తెలంగాణ, ములుగు. 30 మే (హి.స.)
పైన ఖాళీ టమాట పెట్టెలు పెట్టుకొని కింద పశువులను కట్టేసి అక్రమంగా రవాణా చేస్తున్న డీసీఎం వ్యానును శుక్రవారం ఉదయం ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి డీసీఎం వ్యాన్లో 17 పశువులను ఊపిరాడకుండా కట్టేసి పైన టమాటా ఖాళీ పెట్టెలను అమర్చి హైదరాబాద్కు తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పట్టుపడ్డాయి.
అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పశువులు బయటకు కనిపించకుండా టమాట పెట్టెలతో అమర్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు