తెలంగాణ, కామారెడ్డి. 30 మే (హి.స.)
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గోవర్ధన్ అమెరికాలో అనుమాదాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గోవర్ధన్ ఎం.ఎస్చదివేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చదువు ముగించుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. కాగా గోవర్ధన్ ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల విఠల్ కుమారుడు. ఈ నెల 27న అతడు నివాసముంటున్న ఇంటిలో విగత జీవుడుగా కనిపించాడు.. అతడు మృతి చెందినట్లు కుబుంబీకులకు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. .
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు