పేదల వైద్య సేవలకు సహకారం : సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, 30 మే (హి.స.) పేదల వైద్య సేవలకు సహకారం అందిస్తున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన లాలాగూడ నివాసి వసంత, తుకారం గేట్ నివాసి మణెమ్మలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచా
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్


సికింద్రాబాద్, 30 మే (హి.స.)

పేదల వైద్య సేవలకు సహకారం అందిస్తున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన లాలాగూడ నివాసి వసంత, తుకారం గేట్ నివాసి మణెమ్మలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. ఈ క్రమంలో వారికి రూ. మూడు లక్షల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లెటర్ అఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సీ) పత్రాలను, చెక్కులను సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. నిరుపేదలు వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సీతాఫల్మండిలోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నాని పేర్కొన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందేందుకు వీలుగా ఈ పత్రాలను అందించామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande