విది నిర్వహణలో పోలీసులు ప్రజల మన్నన్నలు పొందాలి.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ
తెలంగాణ, సిద్దిపేట. 30 మే (హి.స.) విది నిర్వహణలో పోలీసులు ప్రజల మన్నన్నలు పొందాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. శుక్రవారం ఆమె తొగుట పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్
సిద్దిపేట పోలీస్ కమిషనర్


తెలంగాణ, సిద్దిపేట. 30 మే (హి.స.)

విది నిర్వహణలో పోలీసులు ప్రజల

మన్నన్నలు పొందాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. శుక్రవారం ఆమె తొగుట పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో వివిధ కేసులలో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని సంబంధిత ఎస్ఐకి సూచించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలి. ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.

ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ వాటిపై నిఘా పెంచి ఇసుక, జూదం, పీడీఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande