విజయనగరం 30 మే (హి.స.): సిరాజ్ రెహ్మాన్, సయ్యద్ సమీర్లు కస్టడీలో వెల్లడించిన ఆంశాలపై దర్యాప్తు అధికారులు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా వరంగల్కు చెందిన పర్హాన్ మొహిద్దీన్, ఖాజీపేటకు చెందిన మరో యువకుడిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విజయనగరంలో సిరాజ్, సమీర్లను విచారిస్తున్న సమయంలోనే అధికారులు పలు రాష్ట్రాల్లో అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు విజయనగరం టూటౌన్ పోలీసులు గురువారం సిరాజ్తో పాటు అతని కుటుంబసభ్యుల ఆర్థిక లావాదేవీలపై ఆరాతీశారు. బ్యాంకు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ