టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామస్థాయి నాయకులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి, 30 మే (హి.స.) క‌డ‌ప‌లో జ‌రిగిన మహానాడు అనంత‌రం ఈరోజు సీఎం చంద్ర‌బాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ... మ‌హానాడు అద్భుతంగా జ‌రిగింద‌ని
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామస్థాయి నాయకులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్


అమరావతి, 30 మే (హి.స.) క‌డ‌ప‌లో జ‌రిగిన మహానాడు అనంత‌రం ఈరోజు సీఎం చంద్ర‌బాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ... మ‌హానాడు అద్భుతంగా జ‌రిగింద‌ని, విజ‌యవంతం కావ‌డంలో స‌హాక‌రించిన నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు అభినంద‌నలు తెలియ‌జేశారు.

నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో మ‌రోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. మ‌హానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామంటూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉంద‌న్నారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో...రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామ‌న్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande