పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీల ధ్వంసం.. ఎంపీ పీఏ సహా 15 మంది వైసీపీ నేతలపై కేసు
కడప, 30 మే (హి.స.) మహానాడు సందర్భంగా కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన ఘటనలో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. నిందితుల జాబితాలో కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాఘవరెడ్డిని
పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీల ధ్వంసం.. ఎంపీ పీఏ సహా 15 మంది వైసీపీ నేతలపై కేసు


కడప, 30 మే (హి.స.) మహానాడు సందర్భంగా కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన ఘటనలో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. నిందితుల జాబితాలో కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాఘవరెడ్డిని ప్రధాన నిందితుడిగా (ఏ1) చేర్చగా, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌ను ఐదో నిందితుడిగా (ఏ5) పేర్కొన్నారు.

మహానాడు నేపథ్యంలో పులివెందులలోనూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేసి, ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనలో వైసీపీకి చెందిన పలువురు స్థానిక నాయకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మొత్తం 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా, ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ వంటి కీలక నేతల పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి. ఈ ఘటనతో పులివెందులలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande