తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 31 మే (హి.స.) వెనుకబడిన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూ గరిష్ట పరిమితి చట్టం చేసిందని, భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు భూములు పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 6.70 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేస్తే ఆ భూములను దున్నుకోకుండా అడ్డుకోవడమే కాకుండా మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి బీఆర్ఎస్ దాష్టికాలకు పాల్పడిందని విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసి కార్యకర్తల సమ్మేళనంలో భట్టి మాట్లాడుతూ.. . గిరిజనుల కోసం ఇటీవలే ఇందిరాగాంధీ సౌర గిరిజల పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ పథకానికి రూ. 12,500 కోట్లు కేటాయించామన్నారు.ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఈ సబ్ ప్లాన్ కు రూ. 17,169 కోట్లు కేటాయిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు గాలికి వదిలేసిందని డిప్యూటీ సిఎం మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు