.ఏపి.లిక్కర్.స్కాం లో నిందితుల.కస్టడీ.కొనసాగుతోంది
అమరావతి, 31 మే (హి.స.):ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుల కస్టడీ కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) రెండో రోజు నలుగురు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ఏ1 కసిరెడ్డి రాజశేఖర్
.ఏపి.లిక్కర్.స్కాం లో నిందితుల.కస్టడీ.కొనసాగుతోంది


అమరావతి, 31 మే (హి.స.):ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుల కస్టడీ కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) రెండో రోజు నలుగురు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ఏ1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ 31 ధనుంజయ్ రెడ్డి, ఏ 32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ 33 బాలాజీ గోవిందప్పలను విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు సిట్ ఆఫీసర్స్‌. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వీరిని సిట్ కార్యాలయానికి తరలించి వేర్వేరుగా, కలిపి మరోసారి విచారణ చేయనున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande