తెలంగాణ, కుత్బల్లాపూర్. 31 మే (హి.స.)
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటించారు.
ఫాక్స్ సాగర్ చెరువు కట్ట పక్క నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా అభివృద్ధి చేయనున్న 100 ఫీట్ రోడ్డు ప్రాంతం, సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఫాక్స్ సాగర్ నాలా పై నిర్మించ తలపెట్టిన స్టీల్ బ్రిడ్జి పన్నుల ప్రాంతాన్ని ఆయన జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఫాక్స్ సాగర్ నాలా పై సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టాల్సిన పనుల అంశంలో ఇరిగేషన్ అధికారులు వివరాలను కమిషనర్ కు తెలియజేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు