రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. శరవేగంగా .కొనసాగుతోంది
అమరావతి, 31 మే (హి.స.):రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) ఉదయమే పింఛన్ల పంపిణీ షురూ కాగా.. ఇప్పటి వరకు 84 శాతం మేర పంపిణీ పూర్తి అయ్యింది. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అంద
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. శరవేగంగా .కొనసాగుతోంది


అమరావతి, 31 మే (హి.స.):రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) ఉదయమే పింఛన్ల పంపిణీ షురూ కాగా.. ఇప్పటి వరకు 84 శాతం మేర పంపిణీ పూర్తి అయ్యింది. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు మొత్తం 50.98 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లను అందజేశారు. మొత్తం 63 లక్షల మందికి పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2,717 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 89.38 శాతం మేర పంపిణీ పూర్తి అయ్యింది.

ఉదయం 8.30 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 52 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరుకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande