తెలంగాణ, నిర్మల్. 31 మే (హి.స.) నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో బైంసా పట్టణంలో శనివారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి, సరియైన పత్రాలులేని 54 ద్విచక్ర, 8 త్రిచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి కొరకె ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామని అన్నారు. కాలనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఏరియాలో వచ్చే వారికి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు