తెలంగాణ, ఆదిలాబాద్. 31 మే (హి.స.)
క్షుద్ర పూజల పేరిట మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన క్షుద్ర మాంత్రికుడిని శనివారం అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. బ్రాహ్మణవాడకు చెందిన మహిళ అనారోగ్య సమస్యలు ఉన్నాయి.దీంతో అదే కాలనీకి చెందిన రమేశ్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా సక్రాని గ్రామానికి చెందిన క్షుద్ర మాంత్రికుడు అభినయ్ కుమార్ గురించి బాధిత కుటుంబ సభ్యులకు చెప్పాడు. బాధిత మహిళకు నాగదోషం ఉందని, క్షుద్ర పూజలు చేయాలని అభినయ్ కుమార్ నమ్మ పలికాడు.
గదిలో మహిళను ఒంటరిగా ఉంచి, కుటుంబ సభ్యులను బయటకు వెళ్లాలన్నాడు. గదిలో సదరు మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో ఆమె కేకలు వేయగా కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు మేరకు అభినయ్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు