అమరావతి, 31 మే (హి.స.)
ఈ ప్రమాద దృశ్యాల్ని చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఇనుపచువ్వల లోడ్తో వేగంగా వెళ్తున్న లారీ కొబ్బరి బొండాలతో వస్తున్న వ్యాన్ను తొలుత ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ కారునూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంతెన పై నుంచి 45 అడుగుల కిందకు కారు ఎగిరిపడింది. దానిపైన లారీలోని ఇనుప చువ్వలు పడ్డాయి. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ఐదుగురిలో ఒకరికి గాయాలయ్యాయి. మిగతా నలుగురూ ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద తీరు, తీవ్రతను చూస్తే నిజంగా వీరంతా అదృష్టవంతులు అనాల్సిందే. ఖమ్మం జిల్లా వైరా పట్టణ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ అరుదైన ప్రమాదం చోటుచేసుకుంది. కారు పడ్డ భాగంలో మున్సిపాలిటీ చెత్త ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని చెబుతున్నారు.
న్యూస్టుడే, వైరా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ