మాదాపూర్.పోలీస్ స్టేషన్.పరిదిలో దారుణం చోటుచేసుకుంది
అమరావతి, 31 మే (హి.స.) హైదరాబాద్‌: మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్‌ యశోద ఆసుపత్రికి ఎదరుగా ఉన్న రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అర్ధరాత్రి ఇద్దరు యువకులను బంగారం, డబ్బుల కోసం బెదిరించారు. ఈ క్రమంలో
మాదాపూర్.పోలీస్ స్టేషన్.పరిదిలో దారుణం చోటుచేసుకుంది


అమరావతి, 31 మే (హి.స.)

హైదరాబాద్‌: మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్‌ యశోద ఆసుపత్రికి ఎదరుగా ఉన్న రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అర్ధరాత్రి ఇద్దరు యువకులను బంగారం, డబ్బుల కోసం బెదిరించారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఎదురుతిరగడంతో వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని ఖాజా గూడకు చెందిన జయంత్‌ గౌడ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande