రాష్ట్రం లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా సంకేమ క్యాలెండర్ ను..త్వరలో.విడుదల
అమరావతి, 31 మే (హి.స.) , అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ క్యాలెండర్‌ను త్వరలో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నాయకత్వం సమష్టిగా పని చేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడు నిర్వహణతో నిరూపితమైంద
రాష్ట్రం లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా సంకేమ క్యాలెండర్ ను..త్వరలో.విడుదల


అమరావతి, 31 మే (హి.స.)

, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ క్యాలెండర్‌ను త్వరలో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నాయకత్వం సమష్టిగా పని చేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడు నిర్వహణతో నిరూపితమైందని ఆయన వెల్లడించారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కడప మహానాడు అద్భుతంగా జరిగింది. జిల్లా నాయకత్వమంతా కలిసి పని చేసి విజయవంతం చేశారు. జయప్రదం చేసిన నేతలకు అభినందనలు, కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌. మంత్రులంతా కార్యకర్తల్లా పని చేసి స్ఫూర్తినిచ్చారు. సభకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చింది. మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం. మన ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉంది. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో.. రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించాం. ప్రజలతో నాయకులు మరింత మమేకమవడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలి. నేను ప్రతినెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణంగా కూడా అదే’ అని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande