హత్యాయత్నం కేసులో మాచర్ల మున్సిపల్ మాజీ.చైర్మన్ తురకా కిషోర్ కి గురజాల కోర్టు.14 రోజుల రిమాండ్
అమరావతి, 1 జూన్ (హి.స.) హత్యాయత్నం కేసులో పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత తురకా కిశోర్‌కు గురజాల కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న కిశోర్‌ను పీటీ వారంట్‌పై శనివారం గురజాల కోర్టులో హా
హత్యాయత్నం కేసులో మాచర్ల మున్సిపల్ మాజీ.చైర్మన్ తురకా కిషోర్ కి గురజాల కోర్టు.14 రోజుల రిమాండ్


అమరావతి, 1 జూన్ (హి.స.) హత్యాయత్నం కేసులో పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత తురకా కిశోర్‌కు గురజాల కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న కిశోర్‌ను పీటీ వారంట్‌పై శనివారం గురజాల కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి పి.అలేఖ్య రిమాండ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 2023 నవంబరు 12వ తేదీ రాత్రి కారంపూడి మండలంలోని చింతపల్లి గ్రామంలో గమిడి పూర్ణచంద్రరావు ఇంటికి వెళ్లి వైసీపీలోకి మారాలని మారణాయుధాలతో మహిళలను సైతం బెదిరించి దాడి చేయబోయాడని బాధితుడు పోలీ్‌సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడు ఫిర్యాదును పోలీ్‌సస్టేషన్లో తీసుకోలేదని, ప్రభుత్వం మారగానే మళ్లీ ఫిర్యాదు చేశానని పూర్ణచంద్రరావు తెలిపారు. కిశోర్‌, ఎంపీపీ మేకల శ్రీనివాసరెడ్డి, మరో నేత చిరుమామిళ్ల శ్రీకాంత్‌తోపాటు మరికొందరు బెదిరించిన వారిలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌ పరారీలో ఉన్నారని ఎస్‌ఐ వాసు తెలిపారు. తురకా కిశోర్‌ను తిరిగి గుంటూరు జైలుకు తరలించామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande