హైదరాబాద్, 1 జూన్ (హి.స.)
హైదరాబాద్లో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్లో వరదలు వస్తే కార్లు కొట్టుకుపోవడం, మనుషులు మ్యాన్ హోల్స్ లో పడిపోవడం చూశామని గుర్తుకు చేశారు. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్లో ఆ సమస్యలు అలాగే ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ యుగంలో గొప్పగా విశ్వ నగరం అని చెప్పుకునే హైదరాబాద్ లో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని విమర్శించారు.
చాలా వేగంగా విస్తరిస్తున్న సీటీలో చాలా వరకు పైప్లాన్స్ లేవని, తాగునీటి కనెక్షన్స్ లేవని, ఒక వేళ నల్లా కనెక్షన్లు ఉన్నా కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ ప్రాబ్లమ్ చాలా తీవ్రంగా ఉందని, వేంటనే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..