తెలంగాణ, జగిత్యాల. 1 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజావాణి రద్దు నేపథ్యంలో ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా, జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు