అమరావతి, 1 జూన్ (హి.స.)నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో వచ్చే 3 రోజుల్లో జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపధ్యంలోనే ఆదివారం(01-06-25) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందంది.
సోమవారం(02-06-25) ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 49మిమీ, విజయనగరం జిల్లా పెద్దనడిపల్లిలో 46మిమీ, డెంకాడలో 43మిమీ, శ్రీకాకుళం జిల్లా గరికిపాలెం 42మిమీ వర్షపాతం నమోదయింది. అలాగే జూన్ రెండో వారం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయి. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి