హైదరాబాద్, 1 జూన్ (హి.స.)
ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మందకృష్ణ మాదిగ ఇవాళ ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా సామాజిక న్యాయం తో పాటు ఎస్సీ వర్గీకరణ లో ఆయన చేసిన కృషిని సీఎం ఎంతగానో కొనియాడారు. ఇరువురు నేతలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ప్రస్థానంతో పాటు ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను మంద కృష్ణ మాదిగ సీఎం రేవంత్తో ప్రస్తావిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..