రేపటి నుంచి అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్ లు.. మంత్రి పొంగులేటి
హైదరాబాద్, 1 జూన్ (హి.స.) రాష్ట్రంలోని అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ( ఎఐ) సేవ‌ల‌ను ఉప‌యోగించుకొని ప్ర‌జ‌ల‌కు మ‌రింత సులువైన స‌మ‌ర్ధ‌వంత‌మైన సేవ‌లను అందించ‌బోతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచ
మంత్రి పొంగులేటి


హైదరాబాద్, 1 జూన్ (హి.స.) రాష్ట్రంలోని అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ( ఎఐ) సేవ‌ల‌ను ఉప‌యోగించుకొని ప్ర‌జ‌ల‌కు మ‌రింత సులువైన స‌మ‌ర్ధ‌వంత‌మైన సేవ‌లను అందించ‌బోతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్ర‌క‌టించారు.రాష్ట్ర వ్యాప్తంగా 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు గాను ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌యోగాత్మ‌కంగా రెండు విడ‌త‌ల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లుచేయ‌గా తాజాగా జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు.స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ అధికారుల‌తో నేడు ఆయన స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్తుల క్ర‌య విక్ర‌య‌దారుల‌కు స‌మ‌యం ఆదా అయ్యేలా పార‌ద‌ర్శ‌కంగా అవినీతి ర‌హితంగా మెరుగైన సేవ‌లు అందించేందుకు చేప‌ట్టిన స్లాట్ బుకింగ్ విధానం వ‌ల్ల తాము అనుకున్న విధంగానే స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయని, 94 శాతం ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande