తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త
హైదరాబాద్, 1 జూన్ (హి.స.) రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ(ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపారు
మంత్రి తుమ్మల


హైదరాబాద్, 1 జూన్ (హి.స.)

రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ(ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 11 వేల గ్రామాల్లో 40 వేల మందికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా పంపిణీలో రైతులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande