అమరావతి, 1 జూన్ (హి.స.) ఆపరేషన్ కగార్లో భాగంగా చేస్తున్న ఎన్కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట శనివారం ఒక ప్రకటన విడుదలైంది. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకూ అమరుల స్మారక సభలు నిర్వహించాలని ఆ ప్రకటనలో కోరారు. శాంతి చర్చలకు సిద్ధమని తాము ప్రకటించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి హింసను కొనసాగిస్తున్నాయని ఆక్షేపించారు. 2026 మార్చి 31నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామంటున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యల్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ