హైదరాబాద్, 1 జూన్ (హి.స.)
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక
పరిణామం చోటుచేసుకుంది. కేసులో A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి స్వదేశానికి రాబోతున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 5న విచారణకు హాజరుకాబోతున్నట్లుగా ఇవాళ ఉదయం కేసు ఇన్వెస్టిగషన్ టీమ్కు ముందస్తు సమాచారం అందజేశారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీం కోర్టుకు ప్రభాకర్ రావు ఓ అండర్టేకింగ్ లెటర్ను కూడా మెయిల్ ద్వారా పంపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..