అమరావతి, 1 జూన్ (హి.స.)
విజయనగరం రూరల్: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కనిమేరక, కిందాం అగ్రహారం, గిట్టుపల్లి గ్రామాల్లో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా డిమాండ్ మేరకు రేషన్ దుకాణాల వ్యవస్థను పునరుద్ధరించామని చెప్పారు. జిల్లాలో 1249 రేషన్ షాపుల ద్వారా 5,71,358 రేషన్ కార్డులపై నిత్యవసరాలు సరఫరా చేస్తామని ప్రకటించారు. 65 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ