అమరావతి, 1 జూన్ (హి.స.)
వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం) : భారత రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెల 14న సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని స్టేషన్లలో ఆగుతుందని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్(విజయవాడ) ఎం.రాజా తెలిపారు.
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ వద్ద శనివారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. తొమ్మిది రోజుల యాత్రలో భాగంగా సికింద్రాబాద్లో ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరే ఈ రైలు విజయవాడ, ఏలూరులో బోర్డింగ్ అనంతరం రాత్రి 9 గంటలకు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. ఇక్కడ్నుంచి సామర్లకోట, తుని రైల్వేస్టేషన్లలో ఆగి యాత్రికులతో బయలుదేరుతుందన్నారు. ఈ నెల 22తో యాత్ర ముగుస్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ