హైదరాబాద్, 1 జూన్ (హి.స.)
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాంపల్లి గన్ పార్క్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వంటి ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి జపాన్ ప్రతినిధి బృందం ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలోని జపాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే హైదరాబాద్కు చేరుకుంది. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో వారు పాల్గొంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..