తిరుమల.సర్వ దర్శన్.క్యూ లైన్ లో టిటిడి.కి వ్యతిరేకంగా.నినాదాలు చేసింది.వైకాపా.నాయకుడే
కాకినాడ, 1 జూన్ (హి.స.): తిరుమల సర్వదర్శనం క్యూలైన్‌లో శుక్రవారం రాత్రి తితిదేకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది వైకాపా నాయకుడేనని అధికారులు గుర్తించారు. తితిదే, ఆలయ ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతో మిగతా భక్తులనూ రెచ్చగొట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్
తిరుమల.సర్వ దర్శన్.క్యూ లైన్ లో టిటిడి.కి వ్యతిరేకంగా.నినాదాలు చేసింది.వైకాపా.నాయకుడే


కాకినాడ, 1 జూన్ (హి.స.): తిరుమల సర్వదర్శనం క్యూలైన్‌లో శుక్రవారం రాత్రి తితిదేకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది వైకాపా నాయకుడేనని అధికారులు గుర్తించారు. తితిదే, ఆలయ ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతో మిగతా భక్తులనూ రెచ్చగొట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నినాదాలు చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన బద్దిలి అచ్చారావు(బాబ్జీ)గా గుర్తించారు. ఇతను మాజీ మంత్రి కురసాల కన్నబాబు అనుచరుడు. వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

అతను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు వేణుగోపాలస్వామి నూతన ఆలయ నిర్మాణానికి తితిదే నుంచి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. అచ్చారావు గతంలో చాలాసార్లు తిరుమల వెళ్లారని, సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందో ఆయనకు తెలుసని.. తితిదే ప్రతిష్ఠను దెబ్బతీయడానికి వైకాపా నేతలు కావాలనే అచ్చారావుతో ఇలా చేయించారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చారావు నినాదాలు చేసిన వీడియోలో వైకాపాకే చెందిన తిమ్మాపురం సర్పంచి బెజవాడ సత్యనారాయణ ఉన్నారు. నినాదాలు చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తినీ తితిదే విజిలెన్స్, పోలీసు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అచ్చారావుపై తిరుమల పోలీసులు బైండోవర్‌ కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande