హైదరాబాద్, 12 జూన్ (హి.స.)అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. సిబ్బందితో సహా 242 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం విమానాశ్రయ సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లి కూలిపోయింది. బిల్డింగ్ లో ఉన్న 20మంది డాక్టర్లు చనిపోయినట్టు సమాచారం. ఈ ప్యాసింజర్ విమానం భారత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు