అహ్మదాబాద్, 12 జూన్ (హి.స.)
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం లో కడపటి వార్తల మేరకు ప్రయాణికులు సహా మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం..
మృతుల్లో 230 మంది ప్రయాణికులు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు.
కాగా మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్టుగా ముందు వార్తలు వచ్చాయి కానీ విజయ్ రూపానీ కూలిన విమానంలో లేరని ఆయన వ్యక్తిగత సహాయకుడు
స్పష్టం చేశారు.
వేరే విమానం ఎక్కినప్పటికీ విజయ్ పేరు మాత్రం కూలిన విమానంలోని ప్రయాణీకుల జాబితాలో ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీసు, ఒకరు కెనడియన్ గా అధికార వర్గాల సమాచారం.
ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్డెస్క్- 1800 5691 444..
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..