అమరావతి, 12 జూన్ (హి.:స)అహ్మదాబాద్మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఘోర దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు (గురువారం) సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ