కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నట్టేట ముంచింది.. బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, 12 జూన్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నట్టేట ముంచిందని ఆదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన
బిజెపి ఎమ్మెల్యే


హైదరాబాద్, 12 జూన్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నట్టేట ముంచిందని ఆదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన వల్ల రైతులు ఒకరకమైన బాధలో ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రైతులకు చాలా హామీలు ఇచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక అన్నీ విస్మరించి కాలయాపన చేస్తున్నారు. రైతుభరోసా రావట్లేదు.. రుణమాఫీ పూర్తిగా కాలేదు.. కానీ రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని పాయల్ శంకర్ సీరియస్ అయ్యారు.

వర్షాకాలం ప్రారంభమయ్యాయి.. గ్రామాల్లో వ్యవసాయ పనులు కూడా మొదలయ్యాయి.. ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. అప్పు పుట్టట్లేదు.. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలని స్వయంగా సీఎం మాట్లాడటం ఏంటి.. ఇలాంటి మాట్లాడితే రైతుల్లో భరోసా నింపగలమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు సంతోషంగా ఉంటారని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఎదుర్కొన్న పరిస్థితులను మించి ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande