హైదరాబాద్, 12 జూన్ (హి.స.)
భారత పౌరుడు గర్వించేలా ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు ఉందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం శామీర్ పేట్ లోని ఆయన నివాసంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల సుపరిపాలనపై మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 సంవత్సరానికి ముందు దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు. దేశ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమని దేశ ప్రజలు బీజేపీ కి పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు.
భారత పౌరుడు గర్వించేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిక పడిపోయిన తరుణంలో బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలతో మంచి స్నేహపూరిత వాతావరం తీసుకువచ్చారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్