హైదరాబాద్, 12 జూన్ (హి.స.)
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి
విక్రమార్క మల్లు జాతీయ స్థాయి CA విద్యార్థుల సదస్సులో భాగంగా ముఖ్యోపన్యాసం ఇచ్చారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. CA అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఇది జాతి నిర్మాణంలో భాగస్వామ్యం. దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతను చార్టెడ్ అకౌంట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారు,” అని చెప్పారు. మీ నిజాయితీయే మీ అత్యంత విలువైన ఆస్తి. టెక్నాలజీ, ఆటోమేషన్ వేగంగా మారుతున్న ఈ యుగంలో నైతికతకు కట్టుబడి ఉండే అవసరం మరింత పెరిగింది. మీరు చేసే ప్రతి పని నిజాయితీ, సమన్యాయం, బాధ్యతను ప్రతిబింబించాలి,” అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..