చదువుతోనే సమాజంలో గుర్తింపు,గౌరవం : హైదరాబాద్ కలెక్టర్
హైదరాబాద్, 12 జూన్ (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం గోల్కొండ మండలంలోని సయ్యద్ ముర్తుజా హుసేని మెమోరియల్
హైదరాబాద్ కలెక్టర్


హైదరాబాద్, 12 జూన్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం గోల్కొండ మండలంలోని సయ్యద్ ముర్తుజా హుసేని మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల పున: ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలల్లో వసతులు, మెరుగైన విద్య అందిస్తుందని అన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని, ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. తాను కూడా స్వగ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో చదివి కలెక్టర్ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు.

ప్రతి విద్యార్థి లక్ష్యం నిర్దేశించుకుని బాగా చదివి ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆకాంక్షించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande