అమరావతి, 12 జూన్ (హి.స.)
కడప నగరపాలక, : అనర్హత అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేసిన నోటీసులను కడప నగర మేయర్ సురేష్బాబు ఎట్టకేలకు బుధవారం అందుకున్నారు. తొలుత నోటీసులు స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం సాకుతో తప్పించుకోజూశారు. చివరికి ఇవేమీ పారలేదు. నగరపాలక సంస్ధ సెక్రటరీ రాజశేఖర్ తదితరులు ఆయనకు నోటీసు అందించారు. దీంతో జూన్ 16న మేయర్ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం వెళ్లొచ్చు. సొంత సంస్థ వర్ధిని కన్స్ట్రక్షన్స్కు నగరపాలక సంస్థకు చెందిన పనులు కట్టబెట్టిన అంశంపై తన వాదనలు వినిపించే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ