తెలంగాణ, ములుగు. 12 జూన్ (హి.స.)
ప్రజల సంక్షేమం, తెలంగాణ
రాష్ట్ర అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం రోజున మంత్రి సీతక్క ములుగు జిల్లా ఏజెన్సీలో, పలు అభివృద్ధి , ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హజరయ్యారు.
ముందుగా మంత్రి సీతక్క తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకుని మేడారంలో 1కోటి 98 లక్షలతో నిర్మించిన మేడారం పూజారుల అతిథి సముదాయ భవనమును అడిషినల్ కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్తో కలిసి ప్రారంభించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు