ఆదిలాబాద్, 12 జూన్ (హి.స.)
ఆదిలాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ, బేల మండలంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కురిసిన పిడుగుపాటుకు ఆరుగురు మృతిచెందారు. గాదిగూడ మండలం పిప్రిల్ సౌరే గ్రామానికి చెందిన షీడారం బాయ్, పెందూరు మాధవరావు, పెందూరు సంజన, మంగు భీమ్ భాయి నలుగురు మృతిచెందగా, వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా బేల మండలం సంగడి గ్రామంలో పంట చేనులో విత్తనాలు నాటుతుండగా పిడుగు పడి గెడం నందిని (45), ఫోన్ కాస్ట్ గ్రామంలో పంట చేనులో కోవా సునీత (38) పిడుగు పడి మృతి చెందింది. ఒకే రోజు ఆరుగురు మృతిచెందగా మరో నలుగురు తీవ్ర లో చికిత్స పొందుతున్నారు. మృతులంతా గిరిజనులే. సంబంధిత అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..