పాఠశాలల పునః ప్రారంభం వేళ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన వరంగల్ పోలీసులు
తెలంగాణ, వరంగల్. 12 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు నేడు పునః ప్రారంభమయ్యాయి. ఈసంద‌ర్భంగా వరంగల్ పోలీసులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గురువారం వరంగల్ మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బండి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ
వరంగల్ పోలీసులు


తెలంగాణ, వరంగల్. 12 జూన్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు నేడు పునః ప్రారంభమయ్యాయి. ఈసంద‌ర్భంగా వరంగల్ పోలీసులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గురువారం వరంగల్ మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బండి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వెల్కమ్ చెప్పి, నోట్ బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు.

నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కిలా వరంగల్ లోని ప్రభుత్వ ఆరేల్లి బుచ్చయ్య ఉన్నత పాఠశాల, శివనగర్ శంభునిపేట హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు.అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సిఐ మాట్లాడుతూ… విద్యార్థులు భారతదేశపు బావి భార‌త‌ పౌరులుగా ఎదగాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలు శ్రద్ధగా విని పాఠశాలకు, తల్లిదండ్రులకు గుడ్ నేమ్ తీసుకొని రావాలని ఆయన కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande