తెలంగాణ, పెద్దపల్లి. 12 జూన్ (హి.స.)
నూతనంగా మంజూరైన పోలీస్ స్టేషన్లకు అధికారులను కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా మంజూరైన పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా పురుషోత్తం, పెద్దపల్లి రూరల్ ఎస్ఐగా మల్లేశ్, నూతనంగా మంజూరైన ఎలిగేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా సత్యనారాయణను నియమించారు. పురుషోత్తం ప్రస్తుతం రామగుండం ఎస్ బి లో పనిచేస్తున్నారు.రూరల్ ఎస్ఐగా నియమితులైన మల్లేశ్ ప్రస్తుతం పెద్దపల్లి ఠాణాలో ఎస్ఐ 2గా పని చేస్తున్నారు. ఎలిగేడు ఎస్ఐగా నియమితులైన సత్యనారాయణ ప్రస్తుతం మంచిర్యాల వీఆర్ లో ఉన్నారు. ఈ మూడు పోలీస్ స్టేషన్లను రేపు శుక్రవారం రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు