అమరావతి, 12 జూన్ (హి.స.)
అశ్వారావుపేట గ్రామీణం: ఆగి ఉన్న ద్విచక్రవాహనంపైకి లారీ దూసుకురాగా.. రెప్పపాటులో వాహనదారుడు ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లికి చెందిన బత్తుల కృష్ణ ఏడాది కాలంగా వినాయకపురంలో ఉంటూ జేసీబీ అద్దెకు తిప్పుతున్నాడు.
బుధవారం వినాయకపురం శివారులోని బంకు వద్ద ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకుని సమీపంలో ఆపి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో భద్రాచలానికి సరకులను తరలిస్తున్న లారీ.. వేగంగా దూసుకొచ్చింది. గమనించిన వాహనదారుడు త్రుటిలో తప్పించుకోగా.. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. ఈ ఘటన పెట్రోల్ బంకు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన డ్రైవర్ సూర్య ప్రకాశ్రావుపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై యయాతిరాజు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ