తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. నారాయణగిరి షెడ్ వరకు భక్తులు
తిరుమల, 12 జూన్ (హి.స.) తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా మూడో వారం కూడా భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతోంది. మధ్య రెండు రోజులు స్వల్పంగా తగ్గిన భక్తులు మరోసారి శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. దీంతో తిరుమల కొండపై ఎక్కడ చూసిన
తిరుమల


తిరుమల, 12 జూన్ (హి.స.)

తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా మూడో వారం కూడా భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతోంది.

మధ్య రెండు రోజులు స్వల్పంగా తగ్గిన భక్తులు మరోసారి శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.

దీంతో తిరుమల కొండపై ఎక్కడ చూసిన భక్తుల సమూహం దర్శనమిస్తుంది.

దీంతో ఉచిత దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి, నారాయణగిరి షెడ్ వరకు భక్తులు నిలిచి ఉండటంతో ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 15 నుంచి 18 గంటల వరకు సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

అలాగే రూ.300 శీఘ్ర దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోందని, సర్వదర్శనం టోకెన్ ఉన్నవారికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande